For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

నాడు, నేడు తిరుగులేని నాయకులు కేసీఆర్ " ఒక్కగానొక్కడు " పుస్తకావిష్కరణ.

02:01 PM May 03, 2024 IST | Sowmya
Updated At - 02:01 PM May 03, 2024 IST
నాడు  నేడు తిరుగులేని నాయకులు కేసీఆర్   ఒక్కగానొక్కడు   పుస్తకావిష్కరణ
Advertisement

తెలంగాణ ఉద్యమ కాలంలో  ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్దిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాత్ర అజరామరం అని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ చైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.

శనివారం మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో బీసీ కమీషన్ పూర్వ సభ్యులు జూలూరు గౌరీశంకర్ రచించిన "ఒక్కగానొక్కడు " పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు.

Advertisement GKSC

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమైక్య పాలనలో వివక్షతకు, అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవ్వడాన్ని నిరసిస్తూ, స్వరాష్ట్ర తెలంగాణ సాధన కోసం ఉద్యమించి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. సాధించిన రాష్ట్రాన్ని ఆరేళ్ళలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని వారు స్పష్టంచేశారు.

తెలంగాణ భాషను, యాసను వెక్కిరించిన వాళ్లే, తెలంగాణ అభివృద్ధి చెందడం సాధ్యం కాదు అని విమర్శలు చేసిన నోళ్లే , ఇప్పుడు తెలంగాణ ప్రగతిని చూసి ఔరా.. అని పొగుడుతూ కొనియాడుతున్నారని వక్తలు పేర్కొన్నారు.అసాధ్యాన్ని, సుసాధ్యం చేసిన ఒక్కగానొక్కడు.. కేసీఆర్ అని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, కాలే యాదయ్య, బీసీ కమీషన్ పూర్వ సభ్యులు ఈడిగా ఆంజనేయులు గౌడ్, రామానంద తీర్థ డైరెక్టర్ కిషోర్ రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి , తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Author Image