For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana News: సీఎం కేసీఆర్ ఆదేశంతో బీఆర్కె భవన్ లో విద్యుత్ ఆర్థిక స్థితిగతులపై. సమీక్ష

08:27 PM Dec 13, 2021 IST | Sowmya
Updated At - 08:27 PM Dec 13, 2021 IST
telangana news  సీఎం కేసీఆర్ ఆదేశంతో బీఆర్కె భవన్ లో విద్యుత్ ఆర్థిక స్థితిగతులపై  సమీక్ష
Advertisement

2014 నాటి పరిస్థితుల ఓ సారి అవలోకనం చేసుకుంటే విద్యుత్ కొరత ప్రధాన సమస్య. ఈ కోతలతో రైతులు, పరిశ్రమలు, గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు. గల్లీ నుండి అసెంబ్లీ వరకు విద్యుత్ కోతలపై చర్చలు, రోడ్లపై ధర్నాలు, పొలాలు ఎండిపోయి, బోర్లలో నీరు ఇంకిపోయి రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా ఉండేవి. రాష్ట్రం ఏర్పడే నాటికి పీక్ డిమాండ్ కి 2700 మెగావాట్లు విద్యుత్ లోటు ఉండేది. రోజుకు నాలుగు నుంచి 8 గంటల వరకు గృహ అవసరాలతో పాటు, ఇతర వినియోగదారులకు కోతలు తప్పని సరి. పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పవర్ హాలిడే ప్రకటించే పరిస్థితులు ఉండేవి. వ్యవసాయ రంగానికి నాలుగు నుంచి ఆరు గంటల విద్యుత్ అందిచడం కష్టంగా ఉండేది. అదీ నాణ్యమైన విద్యుత్ అందించలేని పరిస్థితి. మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ పార్మర్లు పేలిపోవడం వంటి సంఘటనలు తరచూ జరుగుతుండేవి. పంటలు ఎండిపోయి రైతుల ఆత్మహత్యల వార్తలు ప్రతీ రోజు పత్రికల్లో ప్రధానంగా కనిపించే పరిస్థితులు ఉండేవి. రాత్రిపూట విద్యుత్ ఇవ్వడం వ ల్ల రైతులు కరెంటు షాక్ తగిలి చనిపోవడం, పాము కాటుకు గురయి రైతులు చనిపోయిన సంఘనటలు కోకొల్లలు. ఈ దుస్తితిని తెలంగాణ రైతాంగం, పారిశ్రామిక వేత్తలు, గృహ వినియోగదారులు ఎదుర్కొనే వారు. ఇలాంటి గడ్డు పరిస్థితులను ఉమ్మడి రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు సరిగా ఎదుర్కోవడంలో విఫలమయ్యాయి. ముందు చూపుతో వ్యవహరించి ఈ విద్యుత్ సమస్యను పరిష్కరించలేకపోయాయి.

కాని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఈ సమస్య అవసరమైన అన్ని పరిష్కార మార్గాలను వెదికారు. పక్క రాష్ట్రాలతో విద్యుత్ ఒప్పందాలు చేసుకుని, కొంచెం ఖర్చు ఎక్కువయినా సరే తగ్గేది లేదంటూ... రాష్ట్రానికి తక్షణ విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుండి కొనడమే కాకుండా రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడేళ్లలో విద్యుత్ సంస్థలను బలోపేతం చేసి, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు మార్గం సుగమం అయింది. తెలంగాణ ఏర్పడిన ఆరునెలల్లోనే అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు కరెంటు కోతలు ఎత్తివేయడం జరిగింది.

Advertisement GKSC

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు
--------------------------------
2014 లో ఒప్పంద సామర్థ్యం 7778 మెగావాట్ల నుండి నేడు 16,623 మెగావాట్లకు పెంచుకోగలిగాం. ఈ ఏడేళ్లలో 8845 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోలిగాం. అంటే 114 శాతం విద్యుత్ ఉత్పత్తి అదనంగా చేయగలిగాం. అదే రీతిలో సోలార్ విద్యుత్ 2014 నాటికి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, మరో 3923మెగావాట్లు పెంచుకుని, నేడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 3997 మెగావాట్లకు పెంచుకున్నాం. విద్యుత్ పీక్ డిమాండ్ 2014లో 5661 మెగావాట్లు ఉండగా, నేడు 13,688 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నాం. 2014 లో పీక్ డిమాండ్ కు 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉన్న స్థితి నుంచి పీక్ డిమాండ్ సమయంలో 13,668 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకోవడం విద్యుత్ శాఖ సాధించిన గొప్ప ప్రగతిగా చెప్పవచ్చు. 2014 లో కోటి 11 లక్షల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయగా, నేడు కోటి 68 లక్షల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయడం జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లు కాగా, 2021 నాటికి తలసరి విద్యుత్ వినియోగం 2012 యూనిట్ల కు పెరిగింది. దేశ తలసరి విద్యుత్ వినియోగం 1161 యూనిట్లు మాత్రమే. దేశ తలసరి వినియోగంతో పోల్చితే తెలంగాణ రెట్టింపు స్థాయిలో ఉండటం విద్యుత్ శాఖ సాధించిన ఘనతగా చెప్పవచ్చు.

ఈ విద్యుత్ పంపిణీ కోసం పెద్ద ఎత్తున సబ్ స్టేషన్లు, ట్రాన్స్ పార్మర్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున బోర్లు, బావుల ద్వారానే ఎక్కువ వ్యవసాయం జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రం ఏర్పడే నాటికి 19 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండేవి. ఈ ఏడేళ్లలో 6 లక్షల 89 వేల కనెక్షన్లు అదనంగా మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు 25 లక్షల 92 వేల కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతోంది. దేశంలో మరే రాష్ట్రం ఇలా ఉచితవిద్యుత్ 24 గంటలు ఇవ్వడం లేదు.

విద్యుత్ శాఖ స్థితి గతులపై మంత్రుల సమీక్ష
----------------------------------------

పెద్ద ఎత్తున రైతులకు, పరిశ్రమలకు, గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తోన్న నేపధ్యంలో ఆ శాఖ తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్కే భవన్ లో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇటీవలే ఏ ఆర్ ఆర్ ప్రతిపాదనలను విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు సమర్పించింది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయ - వ్యయాల వ్యత్యాసం ఆ సంస్థలపై ప్రభావం చూపుతుందని ఈ లోటు పూడ్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రెగ్యులేటరీ కమిషన్ ఆదేశించిన నేపధ్యంలో ఈ అంశంపై చర్చ జరిగింది. మరో వైపు విద్యుత్ సంస్థలు మనుగడ కొనసాగించాలంటే ఈ ఆదాయ - వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, ధరలు సవరించాల్సిందని విద్యుత్ సంస్థలు ఒత్తిడి తెస్తున్నందున ఆ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ లోటును ఎలా పూడ్చాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రభుత్వ ఇంధన కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్ కో అండ్ జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాస్ రావు ల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మరో మారు భేటీ కావాలని నిర్ణయించారు.

Advertisement
Author Image