For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Health మెంతి గింజలతో మధుమేహానికి చెక్….

12:19 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:19 PM May 13, 2024 IST
health మెంతి గింజలతో మధుమేహానికి చెక్…
Advertisement

Health భారతీయ వంట గదిలోని పోపుల పెట్టే సకల రోగాలకు పరిష్కారం చూపుతుందని ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. ఇటీవలి కొవిడ్‌ సమయం నుంచి ఈ మాటల్లోని సత్యాన్ని అన్ని వర్గాల వారు బాగానే అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే… తమకేదైనా సమస్య ఎదురైతే వంటగది వైపు చూస్తున్నారు. ఇటీవల కాలంలో మారిన జీవన శైలితో మధుమేహం, అధిక బరువు సమస్య చాలా మందిని వేధిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. అన్ని వయస్సుల వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి… ఈ రెండు సమస్యలు. మరి వీటికి చెక్‌ పెట్టాలంటే ఏం చేయాలో తెలుసా… మెంతి గింజలను నానబెట్టి ఆ నీటిని తాగాలంటున్నారు… నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల ఉన్న ఉపయోగాలేంటో తెలుసా…

శరీర బరువును నియంత్రించేందుకు…
రాత్రి పడుకునే ముందు కొన్ని మెంతి గింజల్ని నీటిలో నానబెట్టాలి. వాటిని రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు సులభంగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. మెంతుల్లో కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. దీంతో సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. అంతే కాదు వీటిలో క్యాలరీలు అధిక పరిమాణంలో ఉండడంతో… జీర్ణక్రయ కూడా మెరుగుపడుతుందంటున్నారు.

Advertisement GKSC

మధుమేహాన్ని నియంత్రిస్తుంది: మెంతి గింజల్లో మధుమేహాన్ని నియంత్రించే అద్భుత గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ చర్యల్ని ప్రభావితం చేసి రక్తంలోని చక్కెర పరిమాణాన్ని తగ్గిస్తుంది. దాంతో డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంటుంది. ఇలా మధుమేహంతో బాధపడుతున్న వారు మెంతి గింజలను నానబెట్టిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది అంటున్నారు… పరిశోధకులు.

Advertisement
Author Image