For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Rachakonda CP : గణేశ్ నిమజ్జనంకు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాట్లు : సీపీ డి.ఎస్ చౌహాన్ ఐపీఎస్

08:57 PM Sep 25, 2023 IST | Sowmya
Updated At - 08:57 PM Sep 25, 2023 IST
rachakonda cp   గణేశ్ నిమజ్జనంకు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాట్లు   సీపీ డి ఎస్ చౌహాన్ ఐపీఎస్
Advertisement

రాచకొండ పరిధిలోని గణేశ్ నిమజ్జనంకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమీషనర్ శ్రీ డి ఎస్ చౌహాన్, ఐపీఎస్., రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఎసిపి లు మరియు జిల్లాల నుండి వచ్చిన అధికారులతో నాచారం ఐఐసిటిలో ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కమిషనర్ గారు మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో నిర్వాహకులతో, ఇన్ స్పెక్టర్లు సమన్వయం చేసుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనం సమయంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు.

Advertisement GKSC

నిమజ్జనం ఎక్కువగా సాగే చెరువులు మరియు కుంటల మార్గాల్లో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, నీటి పారుదల శాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ గణేష్ నిమజ్జనం శాంతియుతంగా సజావుగా సాగేలా చూడాలన్నారు. సీసీటీవీల ద్వారా నిమజ్జనం సాగే మార్గాల ట్రాఫిక్ ను మరియు నిమజ్జనం జరిగే చోట పరిస్థితులను ప్రతిక్షణం గమనిస్తూ ఉండాలన్నారు.

విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎలాంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు మరియు మార్గాల్లో బందోబస్తును పెంచాలని సూచించారు. అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతవరణంలో నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తప్పుడు వదంతులు వ్యాప్తి చేసే వారి మీద చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, రాచకొండ ట్రాఫిక్ డిసిపి 1 అభిషేక్ మహంతి ఐపీఎస్, ఎస్ఓటి మల్కాజ్గిరి I/c డిసిపి గిరిధర్ ఐపీఎస్,ఎస్బి డీసిపి బాలస్వామి ఐపిఎస్, మహేశ్వరం డిసిపి శ్రీనివాస్ ఐపీఎస్, ఎల్బి నగర్ డీసీపీ సాయి శ్రీ, ట్రాఫిక్ డీసీపీ 2 శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వనాథ్, అనురాధ డీసిపి సైబర్ క్రైమ్, డీసీపీ క్రైమ్స్ అరవింద్, డీసీపీ రోడ్ సేఫ్టీ శ్రిబాల, ఎస్ఓటి డిసిపి 2 మురళీధర్, డీసిపీ అడ్మిన్ ఇందిర అడిషనల్ డీసీపీ లు, ఏసిపి లు, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Author Image