For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Crime : భూ వివాదాలతో ఓ వ్యక్తి తల నరికిన వైనం..

12:40 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:40 PM May 13, 2024 IST
crime   భూ వివాదాలతో ఓ వ్యక్తి తల నరికిన వైనం
Advertisement

Crime ఈ సమాజంలో రోజురోజుకీ మానవ విలువలు దిగజారి పోతున్నాయి ఆస్తి కోసం కొందరు ఎంతకైనా తెలుస్తున్నారు తాజాగా ఆస్తి వివాదాలు వల్ల ఒక వ్యక్తిని దారుణంగా చంపిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

సమాజంలో జరిగే పరిస్థితులు చూస్తూ ఉంటే రోజు రోజు రోజుకూ ఎటు వెళ్ళిపోతున్నామని అనుమానం రాక తప్పదు.. హాస్టల్ కోసం పదవుల కోసం మనుషులు ఎంతకైనా దిగజారి పోతున్నారు తాజాగా ఇలాంటివో సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది..

Advertisement GKSC

భూమి వివాదాలతో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే కుంతీ గ్రామంలో రెండు కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరి పొలాలు పక్క పక్కనే ఉండటంతో సరిహద్దు గొడవలు మొదలయ్యాయి. దీనిని మనసులో పెట్టుకున్న ఓ యువకుడు.. తమ తల్లిదండ్రులతో గొడవ పడుతున్న వ్యక్తిని డిన్నర్ చేయడానికి ప్రయత్నించాడు ఈ సమయంలోనే ఇంట్లో ఎవరూ లేరు సమయంలో అతన్ని అపహరించాడు.. తనతో పాటు మరో ఆరుగురు స్నేహితులను తీసుకువెళ్లి నిర్మానుష్య ప్రదేశానికి అతన్ని తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. తల నరికి వేరు చేశాడు.

అయితే తరచూ ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండడంతో.. తమ వ్యక్తి ఇంటి వద్ద కనిపించకపోవడం, ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమీప బంధువులు, చుట్టుపక్కల వారిని అడిగారు. అయితే.. అతన్ని తన మేనల్లుడు తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. ఈ విషయంపై ఆందోళన చెందిన మృతుడి తండ్రి తన కుమారుడి ఆచూకీ కనిపెట్టాలంటూ ముర్హు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తుండగా అసలు విషయాలు తెలిశాయి.

Advertisement
Author Image