For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

COVID NEWS: "పెను సంచలనం" కృష్ణపట్నం కరోనా మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

02:57 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:57 PM May 11, 2024 IST
covid news   పెను సంచలనం  కృష్ణపట్నం కరోనా మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Advertisement

Krishnapatnam Corona Vaccine, Nellore, Covid News, Corona News, Krishna Patnam Anandaiah, MLA Kakani Govardhan Reddy,

COVID NEWS: "పెను సంచలనం" కృష్ణపట్నం కరోనా మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Advertisement GKSC

పెను సంచలనం. ఒకప్రక్క కరోనా కు సరైన మందులు లేక రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్లు, అత్యంత ప్రభావవంతమైన స్టెరాయిడ్స్ కూడా పనిచేయక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం మరణిస్తుంటే...??? మరో పక్క నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నంలో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను సంచలనం సృష్టిస్తోంది. కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, CT SCAN లో చెస్ట్ సివియారిటీ స్కోర్ 24/25 ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే 0 కి రావడం, ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఒక్కరోజులో లేచి కూర్చోవడం పెను సంచలనం సృష్టిస్తోంది.

సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా ఈ విషయం పెను దుమారం రేపడంతో కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి ఒక్కసారిగా కృష్ణపట్నం పైకి మళ్ళింది. ఒక్క పైసా డబ్బు తీసుకోకుండా ఒక్కరోజు లోనే ఎంత తీవ్రమైన కేసైనా, తగ్గిపోవడం, ఎంత తీవ్రంగా కరోనా ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా రెండు రోజుల్లోనే తగ్గిపోవడం, ఇంత వరకు ఈ వైద్యం పై ఒక్క రిమార్క్ కూడా రాకపోవడంతో వేలాది మంది కృష్ణ పట్నానికి క్యూ కట్టడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ 25 లక్షలు ఖర్చు చేసిన ఏ మాత్రం గ్యారంటీ ఇవ్వని కార్పొరేట్ ఆసుపత్రులు కంటే ఒక్క పైసా తీసుకోకుండా రెండు రోజుల్లోనే నెగెటివ్ తెప్పిస్తామని భరోసా ఇస్తున్న ఆయుర్వేద వైద్యులు మనలాంటి సామాన్యులకు దేవుడితో సమానం అని అనడం అతిశయోక్తి కాదు.

"కృష్ణపట్నంలో కరోనాకు మందు పంపిణీ పై వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందన"

కృష్ణపట్నం గ్రామంలో బొణిగి ఆనందయ్య, తన మిత్రులతో కలిసి కరోనా నివారణకు మరియు కరోనా సోకిన వారికి ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు. బొణిగి ఆనందయ్య, తన మిత్రులతో అందిస్తున్న ఆయుర్వేద మందుకు సంబంధించి ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో మందులు అందిస్తున్నారు. ఆనందయ్య అందిస్తున్న మందు వల్ల వినియోగించిన వారిలో ఇప్పటివరకు సత్ఫలితాలు తప్ప, ఎక్కడా దుష్ప్రభావం చూపలేదు. ఆనందయ్య అందిస్తున్న మందు గురించి లోకాయుక్త, జిల్లా అధికారులను వివరణ కోరడం జరిగింది. అధికారులు, ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయనప్పటికీ, లోకయుక్తకు నివేదిక అందించేందుకు, మందును పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పిన మీదట, మందు యొక్క ప్రభావం పరిశీలించుటకు గడువు కోరడమైనది.

https://youtu.be/lUCb0irJF2w

జిల్లా కలెక్టర్ గారు, ఆయుష్ మరియు ఇతర అధికారులతో సంప్రదించాం.

వీలైనంత త్వరలో, 24 గంటలలోపే మందు యొక్క ప్రభావంపై పరిశీలన పూర్తిచేయవలసినదిగా కోరాం.

krishnapatnam corona vaccine ,nellore ,covid news,corona news,v9 news telugu,teluguworldnow.com,krishna patnam anandaiah ayurvedic medicine,కరోనా నివారణలో భాగంగా, మందు పరిశీలన పూర్తయిన వెంటనే, ప్రజలెవ్వరికీ అసౌకర్యం కలగకుండా, భౌతిక దూరం పాటిస్తూ, ఆనందయ్య అందించే ఆయుర్వేద మందు పంపిణీకి త్వరలోనే చర్యలు చేపడుతాం, నెల్లూరు కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందుపై జిల్లా అధికారులు పాజిటివ్ నివేదిక సమర్పించారు, ఈ నేపథ్యంలో కృష్ణపట్నం ఆయుర్వేదానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

రేపటి నుండి మందు అందుబాటులోకి వచ్చే అవకాశం. నిబంధనలు పాటిస్తూ ఇవ్వాలని ఆదేశం..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం కరోనా మందు పంపిణీపై స్పష్టతనిచ్చిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి...

కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా వ్యాధిని నియంత్రించడానికి, కరోనా సోకిన వారికి నయం చేయడానికి అందజేస్తున్న మందును, రేపటి నుండి (21-05-2021, శుక్రవారం) నుండి పంపిణీ చేస్తున్నాం. ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు పట్ల ఎటువంటి హానీ ఉండదు. కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడింది. ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా ఉదృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, తిరిగి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించాం.

రేపటి నుండి అనగా తేది:21-05- 2021, శుక్రవారం ఉదయం నుండి కరోనా సోకిన వారికి వేరుగా, కరోనా రాకుండా నియంత్రించడానికి వేరుగా భౌతిక దూరం పాటిస్తూ, మందు పంపిణీ చేపడుతున్నాం.

krishnapatnam corona vaccine ,nellore ,covid news,corona news,v9 news telugu,teluguworldnow.com,krishna patnam anandaiah,

Advertisement
Author Image