For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

జై స్వరాజ్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడుగా డాక్టర్ ఆంథోనీ బాప్టిస్టా ఫెర్నాండేజ్

07:07 PM Jul 12, 2024 IST | Sowmya
Updated At - 07:07 PM Jul 12, 2024 IST
జై స్వరాజ్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడుగా డాక్టర్ ఆంథోనీ బాప్టిస్టా ఫెర్నాండేజ్
Advertisement

జై స్వరాజ్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడుగా డాక్టర్ ఆంథోనీ బాప్టిస్టా ఫెర్నాండేజ్ ను జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ నియమించారు. ముంబైలో ఉండే ఆంథోనీకి శుక్రవారం కేఎస్ఆర్ గౌడ ఆన్లైన్లో నియామక పత్రాలు పంపించారు. ఉన్నత విద్యావంతుడైన ఆంథోనీ గతంలో న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకులో చీఫ్ మేనేజర్ గా 2010 వరకు పని చేశారు. తరువాత ఎస్ఆర్పీఎఫ్ శిక్షణ పొందిన ఆయన హ్యాండ్ టూ హ్యాండ్ కమాండో గా 2019 వరకు పని చేశారు. సీ కాడెట్ కార్ప్ గా, ఎన్సీసీ తదితర వాటిని అభ్యసించే సమయంలో పోలాండ్, ఇటలీ, నేపాల్ వంటి దేశాల్లో శిక్షణ తీసుకున్నారు.

ప్రస్తుతం హ్యూమానిటేరియన్ ఆర్గనైజేషన్ అయిన స్వార్డ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియా(జర్మనీ) కమాండర్ గా పని చేస్తున్నారు. అలాగే టేప్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడుగా, సౌత్ ఆసియన్ క్రిస్టియన్ కరాటే ఫెడరేషన్ అధ్యక్షుడుగా, యూనివర్సల్ పీస్ ఆర్గనైజేషన్ అంబాసిడర్ గా, జుజిట్సు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడుగా, స్పోర్ట్స్ అంబాసిడర్ గా ఉన్నారు. ఏడు సార్లు ఇంటర్నేషనల్ కరాటే, జుజిట్సు ఛాంపియన్ గా నిలిచారు ఆంథోనీ. జపాన్ , కెనడా, లుథివేనియా, పోలాండ్, హంగేరి, జర్మనీ, ఇటలీ, గ్రీస్, జూరిచ్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, మారిషస్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, మలేసియా, ఇండోనేషియా, నేపాల్, తదితర దేశాల్లో జరిగిన అనేక క్రీడలు, కరాటే టోర్నమెంట్ లలో ఆయన పాల్గొన్నారు.

Advertisement GKSC

అలాగే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరం ఆంథోనీ మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తుంటారు. అనేక రకాల బాధ్యతలు నిర్వహించిన ఆంథోనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి దేశ సేవ చేయాలని జై స్వరాజ్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ నాయకులతో చర్చించి మహారాష్ట్ర జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడుగా ఆంథోనీని నియమించారు జాతీయ అధ్యక్షుడు కేఎస్ఆర్ గౌడ.

Advertisement
Author Image