For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

యేవ‌మ్ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌ట‌గా వుంది : మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్

02:48 PM Jun 11, 2024 IST | Sowmya
Updated At - 02:48 PM Jun 11, 2024 IST
యేవ‌మ్ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌ట‌గా వుంది   మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్
Advertisement

చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ నెల 14న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మాస్ క‌దాస్ విశ్వ‌క్‌సేన్, ద‌ర్శ‌కుడు సందీప్‌రాజ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ... హీరో న‌వ‌దీప్ యాక్టింగ్ చేస్తే రొమాన్ష్ ఎక్కువ, నిర్మాతగా చేస్తే వాయిలెన్స్ ఎక్కువ అని అర్థ‌మైంది. ఈ సీస్పెస్ అనే సంస్థ‌తో నిర్మాత‌గా  టాలెంట్ యంగ్ పీపుల్‌కు న‌వ‌దీప్ మంచి ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేశాడు. సాధారణంగా అందరూ సినిమాలు చేసిన  త‌రువాత అంద‌రూ ఆ సినిమాలోని చాలా
త‌క్కువ మందితో ట‌చ్‌లో వుంటారు. ఇక నేను న‌టించి  రెస్పెక్ట్ చేసే వాళ్ల‌లో చాందిని చౌద‌రి ఒక‌రు. టెన్ష‌న్ ప‌డే క్యాండేట్ చాందిని. ఈ సినిమాతో చాందిని కి ఆ భ‌యం పోయింది. ఈ సినిమా ద్వారా ఫీమేల్ సంగీత ద‌ర్శ‌కురాలు, ఫీమేల్ ఎడిట‌ర్‌, ఫీమేల్ ఓరియెంటెడ్  చిత్రానికి ప‌నిచేయడం చాలా ఆనందంగా  వుంది. అన్ని రంగాల్లో అమ్మాయిలు వుండాల‌నేది నా కోరిక‌. ఈ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌టేసింది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అంద‌రికి మంచి బ్రేక్‌నివ్వాలి  అన్నారు.

Advertisement GKSC

Advertisement
Author Image