For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఫిబ్రవరి 17న 'డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ' భవన ప్రారంభోత్సవం

10:17 PM Jan 24, 2023 IST | Sowmya
Updated At - 10:17 PM Jan 24, 2023 IST
ఫిబ్రవరి 17న  డా బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ  భవన ప్రారంభోత్సవం
Advertisement

నూతనంగా నిర్మించిన 'డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ' భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17వ తేదీ, శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

ప్రారంభోత్సవానికి ముందు, ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.

Advertisement GKSC

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డా. బిఆర్ అంబేద్కర్ మనవడు శ్రీ ప్రకాశ్ అంబేద్కర్, తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకె అధ్యక్షుడు శ్రీ స్టాలిన్, ఝార్కండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జెడియు జాతీయ అధ్యక్షుడు శ్రీ లలన్ సింగ్, తదితర ముఖ్యులు పాల్గొంటారు.

సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం, సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగసభ జరుగుతుంది.

Advertisement
Author Image