For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Politics ప్రజల కోసం పోరాడిన చరిత్ర మాది.. కేంద్రంలో సమరయోధులు ఎవరున్నారు?.. కేటీఆర్ కామెంట్స్

12:17 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:17 PM May 13, 2024 IST
politics ప్రజల కోసం పోరాడిన చరిత్ర మాది   కేంద్రంలో సమరయోధులు ఎవరున్నారు    కేటీఆర్ కామెంట్స్
Advertisement

Politics ప్రజల కోసం పోరాడిన చరిత్ర తమ కుటుంబానిదని, అందుకు భారతీయుడిగా, తెలంగాణవాసిగా గర్వపడుతున్నానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. 'తాత (అమ్మ శోభ వాళ్ల నాన్న) జె.కేశవరావు మా కుటుంబంలో ఒక స్ఫూర్తిదాయక, ఆదర్శవంతమైన వ్యక్తి' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. దింతో పాటే కేశవరావుతో బాల్యంలో తాను, కవిత, సంతోష్‌ దిగిన ఫొటోను జత చేశారు.

కేశవరావు 1940 చివర్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని.. కేంద్రం ఆయనకు స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకుల్లో ఎంత మంది స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. కేంద్రం ఖర్చు చేసే ప్రతి రూపాయిలోనూ రాష్ట్ర వాటా ఉందని కేటీఆర్‌ ట్విటర్‌లో తెలిపారు. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే.. అక్కడి నుంచి రాష్ట్రానికి 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. నిజంగా విశ్వాసం ఉంటే భాజపా పాలిత రాష్ట్రాల్లోని రేషన్‌ దుకాణాల వద్ద 'తెలంగాణకు కృతజ్ఞతలు'(థ్యాంక్స్‌ టు తెలంగాణ) అని బ్యానర్లు పెట్టాలని ఆయన కేంద్ర ఆర్థికమంత్రికి సూచించారు.

Advertisement GKSC

భాజపా అధికారంలో ఉన్న కాలంలో గుజరాత్‌లో జరిగిన అభివృద్ధికి మూడురెట్ల వృద్ధిని తెలంగాణ సాధించిందని కేటీఆర్‌ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వైద్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్య చేశారు.

Advertisement
Author Image