Special Story : హైదరాబాద్ లో మత కల్లోలాలు జరిగితే నష్టపోయేది హిందువులా ? ముస్లింలా ?
తెలంగాణ ప్రజలారా ... ఆలోచించండి !!
హైదరాబాద్ జనాభా సుమారు కోటి పైనే ఉంటుంది. ఇందులో హిందువులకే ఎక్కువ ఆస్తులు ఉంటయి. ముస్లిమ్స్ లో ఆస్తులు ఎక్కువ ఉండే కుటుంబాలు చాలా తక్కువ. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మరి హిందువుల ఓట్ల కోసం ముస్లింలను బూచిగా చూపి బీజేపీ సృష్టించే మత కల్లోలాల వల్ల ఎక్కువగా నష్టపోయేది హిందువులు కాదా ? ఆస్తుల విలువ పడి పోయినా, వచ్చే కంపెనీలు రాకపోతే ఎక్కువ శాతం ఉద్యోగాలు కోల్పోయినా , వ్యాపారాలు పడిపోయినా , ఎక్కువ నష్టం హిందువులకే కదా ?
మరి హిందువులుగా మనం ఎందుకు ఈ విషయాన్ని ఆలోచించడం లేదు? బీజేపీ హిందువుల ఓట్లతో అధికారంలోకి రావడానికి ప్రయత్నించే క్రమంలో హిందువుల జీవితాలను , ఆస్తులను బలి పెడుతున్న విషయం హిందువులకు ఎందుకు అర్ధం కావడం లేదు ? కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా ? ఈ దేశంలో ఎలాంటి మతపరమైన గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలోని నాయకులే హైదరాబాద్ లాంటి చోట్ల మత కల్లోలాలకు ఆజ్యం పోస్తుంటే ఈ దేశ క్షేమాన్ని , మన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా బీజేపీ ఉన్మాద చేష్టలను అడ్డుకోవాల్సిన బాధ్యత అన్ని మతాల పౌరులకూ లేదా ?
ప్రపంచ మంతా అభివృద్ధి వైపు వెళుతుంటే మనం ఇంకా మతం మంటల్లో మన సమాజాన్ని బీజేపీ ఉన్మాద శక్తులు తగలబెడుతుంటే ఇంకా చోద్యం చూద్దామా ? మన పిల్లల భవిష్యత్తు మతోన్మాదుల మంటల్లో తగలబడుతుంటే ఏమీ పట్టనట్లుగా చూసీ చూడనట్లే వదిలేద్దామా ?
తెలంగాణ ప్రజలారా ఆలోచించండి ! 58 ఏళ్ళు హింస అనుభవించినం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నం. ఒకప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు వారసులుగా , తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన వీరులుగా మన తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ మత ఉన్మాద నరహంతకుల నుండి రక్షించుకుందాం !