For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

కష్టసమయంలో అండగా ఉన్న అందరికీ పాదాభివందనం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

11:32 PM Aug 27, 2024 IST | Sowmya
Updated At - 11:32 PM Aug 27, 2024 IST
కష్టసమయంలో అండగా ఉన్న అందరికీ పాదాభివందనం   ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Advertisement

ఢిల్లీ: ఈ కష్టసమయంలో తనకు, బీఆర్ఎస్ పార్టీకి, కార్యకర్తలకు, తన కుటుంబానికి అండగా ఉన్న తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదభివందనాలు తెలియజేశారు.

తిహార్ జైలు నుంచి విడుదల అయిన తర్వాత కవిత మాట్లాడుతూ… “నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాన బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను అసలే మొండిని. నన్ను జైలుకు పంపించి జగమొండిని చేశారు” అని తేల్చి చెప్పారు. తన తప్పు లేకుండానే జైలులో వేశారని అన్నారు. తనను అక్రమంగా, అన్యాయంగ, కేవలం రాజకీయ కక్షతోనే జైలుకు పంపించారని అన్నారు.

Advertisement GKSC

తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాననని శపథం చేశారు. సమయం కచ్చితంగా వస్తుందని, అప్పుడు కచ్చితంగా స్పష్టం చేశారు. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకటించారు. 18 నసంవత్సరాలు నేను రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నానని, కానీ వ్యక్తిగతంగా తనకు కుటుంబానికి, తన పిల్లలకు దూరంగా ఇంత కాలంగా ఎప్పుడూ లేనని భావోద్వేగంగా ప్రసంగం చేశారు.

తన సోదరుడు, మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరియు బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
Author Image