For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

పక్కింటి యువకుడి కోసం భర్త హత్య

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
పక్కింటి యువకుడి కోసం భర్త హత్య
Advertisement

ఓ యువకుడి కోసం భర్తనే హతమార్చింది ఓ మహిళ. తన సుఖం కోసం భర్త అన్న కనికరం కూడా లేకుండా హత్య చేసింది. ఈ నిర్ఘాంత ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.  తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా హన్మంతపూర్‌ కు చెందిన కొమురెళ్లి.. మూడేళ్లుగా హైదరాబాద్ లోని సీతాఫల్‌మండిలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఈ క్రమంలో కొమురెళ్లి భార్య భారతికి.. ప్రవీణ్‌తో అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి తెరతీసింది.

ఈ విషయం కొమురెళ్లికి తెలిసినా ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడన్న కోపంతో ఏకంగా కొమురెల్లికి టెండర్ పెట్టింది. దీంతో ఎలాగైనా అతన్ని లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. కొమురెళ్లికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఇదే అదునుగా చూసుకున్న భారతి తన చున్నీతో మెడకు గట్టిగా బిగ్గించి చంపేసింది. అనంతరం ధైర్యంగా శవాన్ని రైలు పట్టాలపై పడేసి వెళ్లి పోయింది. గుర్తుతెలియన శవం దొరికిందన్న విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement GKSC

దర్యాప్తులో కొమురెళ్లి మృతికి భార్య భారతీనే కారణమన్న విషయం తెలిసిపోయింది. విచారణలో భారతి పోలీసులకు కళ్లు బైర్లుకమ్మే నిజాలను తెలిపింది. యువకుడితో తనకు ఉన్న సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో అంతమొందించాలని నిర్ణయించామని, అదే రోజు రాత్రి ప్రవీణ్ సహాయంతో మద్యం మత్తులో ఉన్న కొమురెల్లి గొంతుకు చున్నీ బిగించి చేశామని తెలిపింది. ఇదంతా కొమురెళ్లి సోదరుడు వదిన భారతిపై అనుమానం వ్యక్తం చేయడంతో నిజాలు బయటకు పొక్కాయి. దీంతో పోలీసులు భారతి, ప్రవీణ్‌ను అరెస్టు చేసి, న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.

Advertisement
Author Image