For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

హైదరాబాద్ జర్నలిస్టులకు శుభవార్త

08:51 PM Jun 16, 2023 IST | Sowmya
Updated At - 08:51 PM Jun 16, 2023 IST
హైదరాబాద్ జర్నలిస్టులకు శుభవార్త
Advertisement

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు సంబంధించి మంత్రి కేటీఆర్ పూర్తి సానుకూలంగా స్పందించారు. శుక్రవారం ప్రగతిభవన్ లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ తో కలిసి ఈ విషయమై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.

హైదరాబాద్ నగరంలోని జర్నలిస్టుల సంఖ్య ఎంత..? అర్హులైన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు..? అందరికీ ఇళ్లు కేటాయించడానికి ఎంత స్థలం అవసరం అవుతుంది అనే విషయాలను చర్చ లో భాగంగా ఆరా తీశారు. దీంతోపాటు జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కి సంబంధించిన స్థలాలను సభ్యులకు అప్పగించే విషయంపై కూడా చర్చ జరగగా మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు.

Advertisement GKSC

హైదరాబాద్ నగరంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు కూడా ఇళ్లు ఇచ్చే విధంగా వారం పది రోజుల్లో పూర్తిస్థాయి స్పష్టతను ఇచ్చే దిశగా చర్చలు జరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న దాదాపు నాలుగు వేల మంది జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కార దిగగా ముందడుగు పడ్డట్లు అయింది.
ఆస్కాని మారుతి సాగర్
ప్రధాన కార్యదర్శి,TUWJ

Advertisement
Author Image