For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఉద్యోగుల వేటుకు ఫేస్ బుక్ రంగం సిద్ధం

12:31 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:31 PM May 13, 2024 IST
ఉద్యోగుల వేటుకు ఫేస్ బుక్ రంగం సిద్ధం
Advertisement

చాలాకాలం క్రితం చిన్న ఉద్యోగులకైనా, పెద్ద ఉద్యోగులకైనా ఉద్యోగ భద్రత అనేది వుండేది. కానీ, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన సంస్థలు ఎప్పటికప్పుడు మార్కెట్ లో పోటీని తట్టుకునేందుకూ, ఇంకా రకరకాల కారణాలతో ఉద్యోగులను పెద్ద సంఖ్యలో మార్చేస్తుంటాయి. ఉద్యోగుల తొలగింపునకు ఇప్పుడు ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ కూడా సిద్ధమైంది. ఈవారంలో ఉద్యోగులకు పెద్ద ఎత్తున లేఆఫ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ఈ విషయంతో సంబంధం ఉన్న ఉద్యోగి ఒకరు ఈ విషయం చెప్పినట్టు తన కథనంలో తెలిపింది.

కరోనా తర్వాత పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నప్పటికీ ఉద్యోగాల కోతలు పెరుగుతుండడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వేలాదిమంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమైందని, బుధవారం నాటికి ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన ప్రకటన వస్తుందని తెలుస్తోంది. సెప్టెంబరు చివరి నాటికి 87 వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్టు మెటా పేర్కొంది. కాగా, ఈ వారంలో అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ‘మెటా’ ఇప్పటికే ఉద్యోగులకు సూచించినట్టు సమాచారం.

Advertisement GKSC

ఫేస్‌బుక్ 18 సంవత్సరాల చరిత్రలో ఈ స్థాయిలో ఉద్యోగుల కోత ఉండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థలోని ఉద్యోగులను సగానికి సగం తగ్గిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే పలు విభాగాల హెడ్‌లపై వేటు వేయగా, పలువురు ఉద్యోగులను కూడా తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో ఫేస్‌బుక్ నడుస్తుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఉద్యోగుల తొలగింపు వార్తలపై స్పందించేందుకు ఫేస్‌బుక్ ప్రతినిధి నిరాకరించారు.

Advertisement
Author Image