For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

నేడు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల నిరసన.

10:38 AM May 13, 2024 IST | Sowmya
Updated At - 10:38 AM May 13, 2024 IST
నేడు ఏపీలో  రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల నిరసన
Advertisement

Political News: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థుల సంఘాలు నిరసన చేపట్టాయి.ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘ నేతలు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలపై  రాష్ట్రవ్యాప్తంగా  విద్యాసంస్థలను బందుకు పిలుపిచ్చామన్నారు.ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రభుత్వం పాఠశాల పై తీసుకున్న చర్యలపై విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో నేడు నిరసనలకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు.

Advertisement GKSC

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వలన విద్యార్థులకు చదువుకునే అవకాశం దూరమైతుందని తెలిపారు. పాఠశాలల విలీనం పేరుతో ఉపాధ్యాయులను తొలగిస్తున్నారని హర్షాన్ని వ్యక్తపరిచారు. ఆగస్టు నెల కూడా పూర్తవుతుంది ఇంకా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు కూడా నిలిపివేశారని ఊరిలో ఉన్న విద్యాలయాన్ని మూసివేసి దూర ప్రాంతాలకు పంపించడం ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలను ఉచిత పథకాల అనే పేరుతో మోసం చేస్తున్నారని తెలిపారు. నాడు నేడు అనే పేరుతో అభివృద్ధి చేసిన పాఠశాలలను ఏం చేశారన్నారు. అలానే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రావు దీనిపై ఎందుకు స్పదిచడం లేదని  ప్రశ్నించడం జరిగింది.  విద్యారంగంలో ఉన్న సమస్యలను ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని విద్యార్థులకు పుస్తకాలు స్కాలర్ షిప్ అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
Advertisement
Author Image