For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సైబ‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌రేట్‌లో పునర్నిర్మించిన సమావేశ మందిరం, షీ టీమ్ భవనం, మరియు సైబర్ క్రైమ్స్ భవనాలను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ

12:24 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:24 PM May 13, 2024 IST
సైబ‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌రేట్‌లో పునర్నిర్మించిన సమావేశ మందిరం  షీ టీమ్ భవనం  మరియు సైబర్ క్రైమ్స్ భవనాలను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ
Advertisement

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., పునర్నిర్మించిన/Renovation చేసిన సమావేశ మందిరాన్ని, నూతనంగా నిర్మించిన షీ టీమ్ భవనాన్ని మరియు సైబర్ క్రైమ్స్ భవనాలను ప్రారంభించారు.

ఈ సంద‌ర్బంగా సీపీ మాట్లాడుతూ.. ప్రత్యేక సదుపాయాలతో నూతన సమావేశ మందిరం ఏర్పాటు చేశామని, ప్రజలతో మమేకమయ్యేందుకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా ప్రజలకు అందుబటులోకి ఉండేలా షీ టీమ్ కోసం ప్రత్యేక సదుపాయాలతో నూతన భవనాలను పునర్నిర్మించమన్నారు.

Advertisement GKSC

ఈ కార్యక్రమం లో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ శ్రీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ ఇంధిర, డబ్ల్యూ& సియస్ డబ్ల్యూ డీసీపీ శ్రీమతి కవిత, డీసీపీ లావణ్య, ఎస్బీ ఏడీసీపీ లు, ఏసీపీ లు, ఇన్‌స్పెక్టర్లు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Author Image