For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

బోనాల పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు : కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఐ.పి.ఎస్

11:59 PM Jul 13, 2023 IST | Sowmya
Updated At - 11:59 PM Jul 13, 2023 IST
బోనాల పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు   కమిషనర్ డి ఎస్  చౌహాన్ ఐ పి ఎస్
Advertisement

బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఐ.పి.ఎస్, ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్ గూడ కట్టమైసమ్మ గుడినీ సందర్శించిన కమిషనర్ చౌహాన్.

బోనాల పండుగ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ అధికారులను ఆదేశించారు.

Advertisement GKSC

మల్కాజిగిరిలో ఆదివారం సోమవారం జరగబోయే బోనాల ఉత్సవాల సందర్భంగా ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్ గూడ కట్టమైసమ్మ గుడిని సిపి చౌహన్ సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.

బోనాల పండుగ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ భక్తులకు ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఆవరణలో వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

షీ టీం బృందాలు కూడా మహిళా భక్తుల రక్షణ కోసం విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. భక్తులు పోలీసు వారికి సహకరించాలని, సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని ఆకాక్షించారు. మల్కాజ్ గిరి డీసిపి డి.జానకి ఐ.పి.ఎస్, మల్కాజిగిరి ఏసిపి నరేష్ రెడ్డి, కుషాయిగూడ ఏసిపి వెంకట్ రెడ్డి, నేరెడ్మెట్, మల్కాజిగిరి సిఐలు ఇతర అధికారులు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Author Image