For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Crime ఇంటికి వచ్చే కొరియర్లను జాగ్రత్తగా పరిశీలించండి... కమిషనర్ సివీ ఆనంద్..

12:16 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:16 PM May 13, 2024 IST
crime ఇంటికి వచ్చే కొరియర్లను జాగ్రత్తగా పరిశీలించండి    కమిషనర్ సివీ ఆనంద్
Advertisement

Crime మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ కేసులో రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాళ్ళు, డ్రగ్స్‌ సప్లై పైనా కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీవీ ఆనంద్.. డ్రగ్స్‌ కేసులో పెద్ద నెట్‌వర్క్ నడుస్తుంది అన్నారు.. డార్క్‌నెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా వీరంతా పనిచేస్తున్నారన్నారు. డ్రెస్ కు సంబంధించి క్రిప్టో కరెన్సీ ద్వారా జరుగుతున్న లావాదేవీలను పరిశలిస్తామన్నారు..

Advertisement GKSC

ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చే కొరియర్స్‌ను పరిశీలించాలి. ఈ విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా వుండాలి... ఇందులో విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వీరినే టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ముఠాలు పనిచేస్తున్నాయి అన్నారు.. డ్రగ్స్ వాడకం గుర్తించిన 600 మందికి కౌన్సిలింగ్‌ ఇచ్చామని తెలిపారు. డ్రగ్స్‌ విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు మాత్రం తీసుకోవటం తప్పదని.. మతపరమైన వ్యాఖ్యలను ఎవరు చేసినా సహించేది లేదని గట్టిగా చెప్పారు.. ఈ విషయంలో ఇప్పటికే ఇద్దరిపై పీడీయాక్ట్‌ ను నమోదు చేశామన్నారు. సోషల్‌ మీడియాలోని ప్రతీ పోస్టుపై నిఘా ఉంటుంది.

Advertisement
Author Image