For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Viral News : వరి నాట్లు వేస్తున కలెక్టర్ భార్య భర్తలు..

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
viral news   వరి నాట్లు వేస్తున కలెక్టర్ భార్య భర్తలు
Advertisement

Viral News : కలెక్టర్లుగా ఉన్న భార్య భర్తలిద్దరు పొలం బాట పట్టారు. అలాంటి ఈ సంఘటన బాపట్లలో జరిగింది. స్వతహాగా కలెక్టర్లు అయిన దినేష్ కుమార్, విజయకృష్ణన్ దంపతులు.. వరినాట్లు వేస్తు కనిపించారు. అది సామాన్యులకు ఆసక్తిగా ఉంటుంది... ఇంకేముందు.. కెమెరాకళ్లు వారిని బందించాయి.

జిల్లా కలెక్టర్​ అంటేనే ఎప్పుడు బిజీబిజీగా ఉండే లైఫ్. . అదే ఒకే ఇంట్లో భార్య భర్తలిద్దరుగా కలెక్టర్లు ఉంటే వారికి మాట్లాడుకోవడానికి కూడా తీరిక ఉండదు. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే సినిమాలకో, షికార్లకి పోయి అలసట తీర్చుకుంటారు. కానీ ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయకృష్ణన్ లు మాత్రం తీరిక దొరికితే మహర్షి సినిమాని ఫాలో అవుతారు. అదేనండీ వీకెండ్​ ఫార్మింగ్​. ఖాళీ ఉన్నప్పుడల్ల పొలానికి వచ్చి కూలీలతో కలిసి నాట్లు వేయడం, వారితో కలిసి భోజనం చేయడం చేస్తున్నారు.

Advertisement GKSC

బాపట్ల జిల్లా మురుకొండపాడు సమీపంలోని వ్యవసాయ కూలీలతో కలిసి ఈ కలెక్టర్లు వరి నాట్లు వేశారు. తర్వాత అక్కడే పొలం గట్టుపై కూర్చుని భోజనం చేశారు. ఇంత బిజీ లైఫ్ని గడపగలెక్టర్లు కూడా ఇలా పొలం గట్ల పై తిరగటం పొలం పనులు చేయటం అందరికీ చాలా ఆసక్తిని కలిగించింది ఎంతో కాళీ సమయం ఉండి కూడా ఉద్యోగాలు చేస్తూ అలసిపోతున్న ఈనాటి చాలామంది ఉద్యోగస్తులు వీరి నుంచి అలా నేర్చుకోవచ్చు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Advertisement
Author Image