Film News : నూతన దర్శకుడు జానకి రామ్ మారెళ్ల కొత్త చిత్రం ఉగాది సందర్భంగా గ్రాండ్ లాంచ్
హీరో శ్రీవిష్ణు సామజవరగమన, ఓం భీమ్ బుష్' వరుస బ్లాక్బస్టర్స్ తో అద్భుతమైన ఫామ్ లో వున్నారు. కొన్ని ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్లకు సైన్ చేసిన శ్రీవిష్ణు ఈ రోజు తన 19వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించనున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP, విజిల్ వర్తీ ఫిల్మ్స్ & KFC ప్రొడక్షన్ నంబర్ 1గా అనూష ద్రోణవల్లి, సీతా కుమారి కొత, గోపాలం లక్ష్మీ దీపక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి, ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
#SreeVishnu19 ఈరోజు తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా, పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో ఘనంగా ప్రారంభమైయింది. నవీన్ యెర్నేని, నందిని రెడ్డి, కిషోర్ తిరుమల స్క్రిప్ట్ని మేకర్స్కి అందజేశారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్కి వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తం వేడుకకు సాహు గరిపాటి, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, శరత్ మరార్, సితార నాగ వంశీ, బివిఎస్ రవి, తదితరులు హాజరయ్యారు.
శ్రీవిష్ణు డిఫరెంట్ జానర్ సినిమాలు చేయడంతో పాటు ప్రతి సినిమాలో తగిన వినోదం ఉండేలా చూసుకుంటున్నారు. #SreeVishnu19 మరొక ఆసక్తికరమైన థీమ్తో కూడిన ఫన్ ఫిల్డ్ ఎడ్వంచర్. భాను భోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ రాస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, విజయ్ బులగానిన్ సంగీతం అందించనున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, నారిని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు.