For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana News: ప్ర‌పంచ ఉత్త‌మ ప‌ర్యాట‌క గ్రామంగా "భూదాన్ పోచంప‌ల్లి": United Nations World Tourism Organisation (UNWTO)

10:20 PM Nov 16, 2021 IST | Sowmya
Updated At - 10:20 PM Nov 16, 2021 IST
telangana news  ప్ర‌పంచ ఉత్త‌మ ప‌ర్యాట‌క గ్రామంగా  భూదాన్ పోచంప‌ల్లి   united nations world tourism organisation  unwto
Advertisement

తెలంగాణ‌కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని భూదాన్ పోచంప‌ల్లి గ్రామానికి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించింది. ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా భూదాన్ పోచంప‌ల్లి ఖ్యాతి గడించింది.

ఐక్య‌రాజ్య స‌మితికి అనుబంధంగా ఉన్న ప్ర‌పంచ ప‌ర్యాట‌క సంస్థ‌.. భూదాన్ పోచంప‌ల్లిని ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపిక చేసింది. భార‌త‌దేశం నుంచి 3 గ్రామాలు పోటీ ప‌డ‌గా భూదాన్ పోచంప‌ల్లి ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపికైంది. డిసెంబ‌ర్ 2వ తేదీన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో భూదాన్ పోచంప‌ల్లి గ్రామానికి అవార్డును ప్ర‌దానం చేయ‌నున్నారు. భూదానోద్య‌మంతో పోచంప‌ల్లికి భూదాన్ పోచంప‌ల్లిగా మారింది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పోచంప‌ల్లి పేరు సంపాదించింది. పోచంప‌ల్లిలో నేసే ఇక్క‌త్ చీర‌ల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు ఉంది.BhoodanPochampally Village Selected as Best Tourism Place by United Nations World Tourism Organisation (UNWTO),Telangana News,v9 news telugu,www.teluguworldnow.com

Advertisement GKSC

Advertisement
Author Image