For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Health దంపుడు బియ్యంతో ఎన్ని లాభాలో..!

12:23 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:23 PM May 13, 2024 IST
health దంపుడు బియ్యంతో ఎన్ని లాభాలో
Advertisement

Health ఇప్పుడంతా పాలీష్‌ చేసిన తెల్ల బియ్యం తినే వాళ్లే ఎక్కువ. బియ్యాన్ని ఎంత సన్నగా, తెల్లగా పాలీష్‌ చేస్తే… అంతగా డిమాండ్‌, ధర చెల్లిస్తున్నారు విక్రయదారులు. కానీ… ఒకప్పుడు మన పెద్ద వాళ్లంతా దంపుడు బియ్యాన్నే తీసుకునే వాళ్లు. పెద్ద పెద్ద రోకళ్లతో దంచుకుని… వరి పొట్టును మాత్రమే తీసిన బియ్యాన్ని తినే వాళ్లు. కానీ… మారుతున్న కాలంతో పాలీష్‌డ్‌ బియ్యానికి డిమాండ్‌ పెరిగింది. ఐతే… పాలిష్‌ చేసిన బియ్యం కంటే దంపుడు బియ్యంతోనే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది అంటున్నారు.. పరిశోధకులు. ఈ మాట ఎప్పటి నుంచో చెబుతున్నా… ఇప్పుడిప్పుడే ప్రజలు ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. ఇంతకీ… దంపుడు బియ్యంలో ఉండే పోషకాలు సంగతేంటో తెలుసా…?

వరి పొట్టు కింది తవుడు పొరలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలిష్ చేసినప్పుడు ఇవ్వన్నీ పోతాయి. దంపుడు బియ్యంతో అయితే ఇవ్వన్నీ ఆహారంలో చేరతాయి. వారానికి 5.. అంతకన్నా ఎక్కువ సార్లు తెల్లబియ్యం తీసుకోవటం వల్ల షుగర్‌ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో దంపుడు బియ్యాన్ని తీసుకుంటే 16% ఈ ముప్పు నుంచి బయటపడవచ్చని తేలింది. అంతేకాదు.. రక్తపోటు పెరిగేందుకు కారణమయ్యే సోడియం పాళ్లు కూడా దంపుడు బియ్యంలో తక్కువే. ఇక పోషకాల పరంగా చూస్తే… ఆహారాన్ని శక్తిగా మార్చే నియాసిన్‌, విటమిన్‌ బి-3 ఎక్కువ.
థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి, విశృంఖల కణాల ఉత్పత్తిని అడ్డుకునేందుకు ఉపయోగపడే సెలీనియం కూడా దంపుడు బియ్యంలో ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు.. దంపుడు బియ్యంలోని పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఈ కారణంగా… రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరగవు. బ్రౌన్‌రైస్‌లో పీచు పదార్థం ఎక్కువ…. ఇది గుండె వాల్వ్‌లు మూసుకుపోకుండా నిరోధిస్తుంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోజూ శరీరానికి అందడం వల్ల పెద్దపేగూ, రొమ్ము వంటి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువంటున్నారు… పరిశోధకులు.

Advertisement GKSC

Advertisement
Author Image