For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మాజీ సైనిక ఉద్యోగుల సంఘం సమావేశానికి ముఖ్య అతిధిగా డా. కందుల గౌతమ్ నాగి రెడ్డి

02:33 PM Jul 08, 2023 IST | Sowmya
Updated At - 02:33 PM Jul 08, 2023 IST
మాజీ సైనిక ఉద్యోగుల సంఘం సమావేశానికి ముఖ్య అతిధిగా డా  కందుల గౌతమ్ నాగి రెడ్డి
Advertisement

మాజీ సైనిక ఉద్యోగుల సంఘం వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించిన కందుల ఓబుల రెడ్డి హాస్పిటల్ చైర్మన్ గౌతమ్ నాగి రెడ్డి గారు !!

ఈ సందర్బంగా సైనిక ఉద్యోగుల ప్రెసిడెంట్ సెక్రటరీ మాట్లాడుతూ... మాజీ సైనిక ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య అవసరాల నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందిపడ్తున్నామని , అన్ని సౌకర్యాలు ఉన్న కందుల ఓబుల రెడ్డి హాస్పిటల్ మాజీ సైనిక ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించి మిలిటరీ ఉద్యోగుల ఆరోగ్య అవసరాల దృష్ట్యా ఎంపానెల్ మెంట్ కావాలని కోరారు.

Advertisement GKSC

దానికి గౌతమ్ నాగిరెడ్డి గారు సమ్మతించి వెంటనే హాస్పిటల్ ఎంపానెల్ మెంట్ కి సంబంధించిన పత్రాలను తయారు చేసి దేశం కోసం సేవలందించే మిలిటరీ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సౌకర్యాలు త్వరలో కలుగ జేస్తామని తెలియ జేశారు . అది హాస్పిటల్ భాద్యత అని తెలియజేసారు.

గర్భిణీ స్త్రీల ఆపరేషన్లు , జనరల్ సర్జరీ ఆపరేషన్లు, ఎముకలు కీళ్ల శస్త్ర చికిత్సలు , చెవి ముక్కు గొంతు ఆపరేషన్లు, కిడ్నీ లో రాళ్లు కిడ్నీ సంబంధిత ఆపరేషన్లు , దంత వైద్యం ,జనరల్ మెడిసిన్ , ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ మరియు హృద్రోగ నిర్ధారణ పరీక్షలు ,ఉదరకోశ పరీక్షలు, గ్యాస్ట్రో స్కోపీ , నరాలు మెదడు సంబంధిత వ్యాధ్యులకు సేవలు అందజేస్తామని తెలియ జేశారు.

ఈ సందర్బంగా గౌతమ్ నాగి రెడ్డి గారిని కమిటీ సభ్యులు సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ప్రెసిడెంట్ హరినారాయణ రెడ్డి , సెక్రటరీ శేషసాయి , వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ మరియు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
Author Image