Political News: ఆంధ్రా జలదోపిడీ: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Andra Jaladopidi, AP POLITICS, AP Telangana border Krishna Water, Telugu World Now,
*ఆంధ్రా జలదోపిడీ, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై రేవల్లి మండలకేంద్రంలో రైతువేదిక ప్రారంభించిన సంధర్భంగా నిప్పులు చెరిగిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు*
తెలంగాణ ప్రయోజనాల విషయంలో నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ నేతలది సైంధవపాత్ర
- హక్కు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాతరేస్తాం .. దాదాగిరీ, గూండాగిరి నడవనివ్వం
- ఇప్పుడు మాదొక రాష్ట్రం .. మా హక్కులకు విరుద్దంగా కృష్ణా బేసిన్ లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వం
- కృష్ణా నది నుండి తెలంగాణకు హక్కుగా వచ్చే ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంటాం
- వెన్నెముక లేని బానిస నేతల మూలంగానే గతంలో తెలంగాణకు అన్యాయం జరిగింది
- ఏపీ జలదోపిడీని ఎట్టి పరిస్థితులలో అడ్డుకుని తీరుతాం .. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తాం
- సమైక్యపాలనలో ఆంధ్రా జలదోపిడీకి మద్దతుగా హారతులు పట్టినోళ్లు, దొంగ ప్రాజెక్టులకు సద్దులు మోసిన ఇంటి దొంగలు ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని హాహాకారాలు చేస్తున్నరు
- తెలంగాణ ఉద్యమమే నదీజలాలు, సాగునీటి హక్కుల కోసం
- కృష్ణాజలాలలో తెలంగాణ నీటి వాటా తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది
- ఉమ్మడి రాష్ట్రంలో పాలకులుగా మీరున్నారు .. పాలితులుగా తెలంగాణ ప్రజలున్నారు .. అప్పుడు ఇక్కడి నాయకత్వం మీకు పదవుల కోసం బానిసలుగా మారడంతో అక్రమ ప్రాజెక్టులను కట్టగలిగారు
- అసలు ప్రాజెక్టులు
కట్టుకునేందుకు
ఏపీకి శాశ్వత నీటి కేటాయింపులు ఎక్కడివి ?
- ఇప్పుడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం .. ఆంధ్రా జలదోపిడీని అడ్డుకుంటాం .. ఈ దేశంలో రాజ్యాంగం అమలులో ఉందన్న విషయం ఏపీ ప్రభుత్వం గుర్తించాలి
- నీటి కేటాయింపులు జరిగాక, అన్ని రకాల అనుమతులు వచ్చాకనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తాం అని ఏపీ ప్రభుత్వం రాతపూర్వకంగా రాసిచ్చారు
- ఏపి ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవ్యతిరేకం, విభజన చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకం, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం
- కేంద్రప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి .. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు నిర్ణీత కాలగడువు విధించి కృష్ణా జలాలలో తెలంగాణ , ఆంధ్రా నీటివాటాలు తేల్చాలి
- వృధాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు స్నేహ హస్తం అందించారు
- కేసీఆర్ గారు దూరదృష్టితో చేసిన సూచనలను వదిలేసి కృష్ణా జలాలను అన్యాయంగా తీసుకుపోతామనడం మిత్ర ద్రోహమే
- రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గర్హనీయం .. ఆయా రాష్ట్రాల సహజ వనరులు సద్వినియోగం చేసుకునేందుకు కేంద్రం సమస్యలు పరిష్కరించి సహకరించాలి
- ఒక ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చే ఉత్పత్తి ఎంత ? నీటి సంపద ఎంత ? మత్స్యసంపద ఎంత ? జీవవైవిధ్యం ఎంత ? పశుసంపద ఎంత ? మొత్తంగా వచ్చే సమాజ సంపద ఎంత ?
- వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం వ్యవహరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు
- ఏపీ జలదోపిడీ, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై రేవల్లి మండలకేంద్రంలో రైతువేదిక ప్రారంభించిన సంధర్భంగా నిప్పులు చెరిగిన
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు