Political : అమరావతి రైతుల పాదయాత్ర పై అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్
Political ప్రస్తుతం అమరావతి రైతులు చేస్తున్నది ఫేక్ పాదయాత్ర అని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ పాద యాత్ర లో నిజమైన రైతుల కంటే రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారని అన్నారు.. అందుకే ఆ యాత్ర మధ్యలోనే ఆగిపోతుందన్నారు. అక్కడ ఉన్న వారిని ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర కాక మరి ఏమవుతుందని అని ప్రశ్నించారు. గత 40 రోజులుగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అమరావతి రైతులు పాదయాత్ర చేశారని విమర్శించారు. అంతే కాకుండా ఇక్కడ రైతుల పేరుతో రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాదయాత్రకు వచ్చిన ఈ విరామం తాత్కాలికం కాదని, శాశ్వత విరామమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మిగిలిన పార్టీ నాయకులు అంతా ఏకమై వెనుకనుండి ఈ పాదయాత్ర నడిపిస్తున్నారని ఇదంతా ఫలం కొనసాగదని అన్నారు..
గుడులకు వెళ్లాల్సిన యాత్ర నియోజకవర్గాల నుంచి ఎందుకు వెళుతుందని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అమరావతి యాత్ర రాజకీయ పాదయాత్రగా తయారయిందని దుయ్యబట్టారు. ‘తెలుగుదేశం, జనసేన నాయకులు కలిపి చేస్తున్న పాదయాత్ర. ఒళ్లు బలిసిన వాళ్ల పాదయాత్ర. అరసవల్లి సూర్యదేవాలయానికి వెళ్లే అర్హత మీకు లేదు. ఈ పాదయాత్ర సక్రమంగా కొనసాగదు ఎందుకంటే పాదయాత్రలో ఉన్నవాళ్లంతా రైతులు కాదు... దోపిడీ దొంగలు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు లాంటివాళ్లు’ అని మంత్రి మండిపడ్డారు...