For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

411 రోజుల తర్వాత తగ్గిన కరోనా మహమ్మారి...

12:31 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:31 PM May 13, 2024 IST
411 రోజుల తర్వాత తగ్గిన కరోనా మహమ్మారి
Advertisement

కరోనా ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో మనందరికీ తెలిసిందే. ఎక్కువ రోజులు కరోనాతో పోరాడి బతుకు జీవుడా అని బయటపడిన వారు వున్నారు, జీవన పోరాటంలో ఓడి అసువులు బాసినవారూ వున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రభావం చూపుతోంది.

కరోనా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఓ వ్యక్తి కరోనా నుంచి బయటపడటానికి సుదీర్ఘంగా మహమ్మారితో పోరాడాడు. ఏకంగా 411 రోజుల పాటు కరోనాకు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. బ్రిటన్ కు చెందిన 59 ఏళ్ల వ్యక్తికి 2020 డిసెంబర్ లో ఫస్ట్ వేవ్ లో కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతూనే ఉన్నారు.

Advertisement GKSC

పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ లాంగ్ కోవిడ్ కారణంగా ఆయన బాధపడ్డారు. వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధిని నయం చేశామని బ్రిటన్ పరిశోధకులు తెలిపారు. చనిపోతాడనుకున్న వ్యక్తిని బతికించామని చెప్పారు. ఏదేమైనా మృత్యుంజయుడైన ఆ వ్యక్తిని నిజంగా అభినందించాల్సిందే...!!

Advertisement
Author Image