For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

CM KCR : తెలంగాణలో కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్..!

12:36 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:36 PM May 13, 2024 IST
cm kcr   తెలంగాణలో కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
Advertisement

CM KCR : తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తాజాగా ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా మెడికల్ కాలేజీలకు ప్రారంభించారు కేసీఆర్. ఈ కాగా జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్మించింది. సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణలో చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం అని అన్నారు. ఈ మేరకు తెలంగాణలో 1,180 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని... ఎవ్వరూ ఊహించని విధంగా వాటిని నిర్మించామని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం అని... ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అందుబాటులోకి తీసుకురావటానికి మంత్రి హరీశ్ రావు ఎంతో కృష్టి చేశారని కొనియాడారు. కొత్తగా నిర్మించిన ఈ ఎనిమిది కాలేజీలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యలు 2,790కి పెరిగిందని తెలిపారు. పీజీ సీట్లు కూడా 1,180కి పెరిగాయని... ఇటువంటి అభివృద్దితో దూసుకుపోతున్న తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా మారుతోందన్నారు.

Advertisement GKSC

కాగా గత 8 ఏళ్ల లోనే 12 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని మరింతగా పెంచటానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీంట్లో భాగంగానే వచ్చే ఏడాది 9, పైఏడాది మరో 8 కాలేజీల ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని కే‌సి‌ఆర్ తెలిపారు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. తెలంగాణాను అభివృద్ది పధంలో నడిపించడానికి తమ ప్రభుత్వం అన్నీ విధాలా కృషి చేస్తుందని సి‌ఎం కే‌సి‌ఆర్ అన్నారు.

Advertisement
Author Image