For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'జనతా హోటల్' సినిమాకి ఆరేళ్లు

07:18 PM Sep 14, 2024 IST | Sowmya
Updated At - 07:18 PM Sep 14, 2024 IST
 జనతా హోటల్  సినిమాకి ఆరేళ్లు
Advertisement

తెలుగులో జనతా హోటల్ రిలీజ్ అయి ఆరేళ్లు పూర్తయింది. విభిన్నమైన సినిమాలతో ఎప్పుడూ వైవిధ్యాన్ని కనబరిచే నిర్మాత సురేష్ కొండేటి. ప్రేమిస్తే, షాపింగ్‌మాల్, పిజ్జా, జర్నీ, నాన్న లాంటి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి అదే కోవలో మరో గొప్ప సినిమాను ఆడియన్స్ ముందుకు తెచ్చారు. ‘మహానటి’ ఫేం దుల్కర్ సల్మాన్, క్యూట్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఉస్తాద్ హెటల్‌ను తెలుగులో ‘జనతా హోటల్’ పేరుతో సెప్టెంబర్ 14 2018న విడుదల చేశారు.

మలయాళంలో ఉస్తాద్ హోటల్ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో జనతా హోటల్‌ పేరుతో ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి నిర్మాతగా రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అన్వర్ రషీద్ దర్శకత్వం వహించాడు . డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కావాలనుకునే ఈ యువతరంలో.. తాను చెఫ్‌గా మారలనుకునే హీరో కథతో ఎంతో ఆసక్తికరంగా సాగే సినిమా ఇది. విదేశాలకు వెళ్లి మరీ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసొచ్చిన ఓ చెఫ్ చుట్టూ నడిచే కథతో ప్రేక్షకులను అలరించింది ఈ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి ఆరేళ్ళు పూర్తయ్యాయి.

Advertisement GKSC

Advertisement
Author Image